బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్‌

-

బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలు పై ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌. మెస్ కాంట్రాక్టర్లను మార్చక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత మంది మంత్రులు, అధికారులు ఉండి కాంట్రాక్టర్లను మార్చక పోవడం ఏమిటని వీసీ ని నిలదీశారు మంత్రి కేటీఆర్‌.

నాణ్యమైన భోజనం పెట్టకుంటే మనమంతా ఉన్నదెందుకన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని, ఎవరైనా ఎక్కువ చేస్తే పోలీసులకు చెప్పి సెట్ చేయండని ఆదేశించారు. టి.హబ్ ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని ,తాను మళ్లీ వస్తానని చెప్పారు. మంత్రుల సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి విద్యార్థులకు లాప్ టాప్ లు, యూనిఫామ్ లు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news