మా ప‌థ‌కాల‌న్నీ అక్క‌డ చూపిస్తావా? ధైర్యం ఉందా? : కేటీఆర్

-

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్.. సోమవారం కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ ప‌నుల‌కు సంబంధించి ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల్లో కేంద్రం డ‌బ్బులున్నాయ‌ని ఒకాయ‌న పాద‌యాత్ర‌లు చేస్తూ అడ్డం పొడ‌వు మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఏ ఊరికి పోయినా చెట్లు, న‌ల్లా క‌నెక్ష‌న్లు క‌న‌బ‌డుతున్నాయని, ఆస‌రా పెన్ష‌న్లు అందుకుంటున్న అవ్వ‌లు క‌న‌బ‌డుతున్నారని, రైతు వేదిక‌లు, వైకుంఠ‌ధామాలు, డంప్ యార్డులు క‌న‌బడుతున్నాయన్నారు.

Telangana Minister KTR lashes Out At Centre's Inefficient Vaccine Policy;  Says Centre Bungled Up And Pitted States Aganist Each Other

ఈ ప‌థ‌కాల‌న్నింటిలో కేంద్రం పైస‌లు ఉన్నాయ‌ని బండి సంజయ్ అంటున్నాడని.. మ‌రి కేంద్రం పైస‌లే మ‌న ప‌థ‌కాల్లో ఉంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప‌థ‌కాలు అమ‌లు కావాలి క‌దా? అని బండి సంజయ్ కి ప్రశ్నాస్త్రాలు సంధించారు కేటీఆర్. క‌ర్ణాట‌క‌లోని రాయిచూర్‌లోకి పోదాం.. మీరు చెప్పే మాట‌ల్లో నిజాయితీ ఉంటే.. మా ప‌థ‌కాల‌న్నీ అక్క‌డ చూపిస్తావా? ధైర్యం ఉందా? అని కేటీఆర్ స‌వాల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news