నేడు వరంగల్, హన్మకొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

-

వరంగల్: నేడు వరంగల్, హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. ఈ టూర్‌ లో భాగంగా ఇవాళ ఉదయం 9.15 గంటలకు వరంగల్ ఆర్ట్ , సైన్స్ ప్రాంగణానికి చేరుకుంటారు. 9.30 నుంచి 10 గంటల వరకు వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 10.10 గంటలకు స్మార్ట్ రోడ్డు ఆర్ -4 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 10.20 నుంచి 10.30 గంటల వరకు రీజినల్ గ్రంథాలయం ప్రారంభం కానుండగా.. 10.40 గంటలకు స్మార్ట్ రోడ్డు ఆర్ -4 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

10.50 నుంచి 11.20 గంటల వరకు పబ్లిక్ గార్డెన్లో చేపట్టిన వివిధ పనులను ప్రారంభిస్తారు. 11.30 గంటలకు హెలీక్యాప్టర్లో నర్సంపేట బయలు దేరనున్నారు. 12 గంటలకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్కు చేరుకుంటారు. 12.10 నుంచి 12.20 వరకు నర్సంపేట మునిసిపాలిటీ కార్యాలయంలో వివిధ ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనల్లో పాల్గొంటారు. 12.30 నుంచి 12.40 గంటల వరకు అశోక్ నగర్లో పైపుల ద్వారా గ్యాస్ పంపిణీ ప్రారంభం జరుగనుండగా… 12.40 నుంచి 1.30 వరకు బైపాస్ రోడ్డులో బహిరంగ సమావేశం ఉండనుంది. 1.30 గంటలకు నర్సంపేటలో బయలు దేరి 2 గంటలకు ఆర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. 6 గంటలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్నారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news