చంద్రబాబుకు – జగన్ కి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది – మంత్రి పెద్దిరెడ్డి

-

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి జిల్లాకు ఒక రీజనల్ కోఆర్డినేటర్, ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పరిపాలన మన ఇంటి ముంగిటకు వచ్చేలా చర్యలు చేపడుతున్నాం అన్నారు. అలాగే పార్టీ బలోపేతం పై దృష్టి సారించామన్నారు. అందరూ కలిసి పార్టీ కోసం పని చేసేలా అందరినీ కలుపుకుని వెళ్ళాలని సూచించారు మంత్రి పెద్దిరెడ్డి.

జగన్ మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రి చేసేలా మనమంతా కష్టపడాలన్నారు. చంద్రబాబు కు, సీఎం వైఎస్ జగన్ కు మధ్య నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి 14 కు 14 సీట్లు వైసిపి కైవసం చేసుకునేలా అందరం కృషి చేస్తాంమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news