తెలంగాణకు శుభవార్త..రాష్ట్రానికి టెక్స్ టైల్ పార్కు ప్రకటించిన కేంద్రం

-

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణకు ‘పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్స్ పార్క్’ను ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 మెగా టెక్స్‌టైల్స్ పార్కులలో తెలంగాణకు చోటు దక్కిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దీని ద్వారా లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. వేలాదిమంది యువతకు ఉద్యోగ కల్పన ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఈ ‘పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్స్ పార్క్’ కు సంబంధించి.. మిగిలిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news