రాష్ట్ర డీజీపీ వెంటనే రాజీనామా చేయాలి : రఘునందన్‌ రావు

-

నిఘా వ్యవస్థ తెలంగాణ లో నిద్ర పోతుందంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. శుక్రవారం సికింద్రాబాద్‌లో చోటు చేసుకున్న ఆందోళనపై స్పందించి ఆయన.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడికి వేలమంది తరలి వస్తుంటే నిఘా వ్యవస్థ కూడా ఫామ్ హాజ్ లో పాడుకుందా అంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకురాలు ఎస్ ఐ కాలర్ పట్టుకుంటే పోలీసులు ఎం చేస్తున్నారని, టీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలో కలిసి పోటీ చేయడానికే నిన్నటి రాజ్ భవన్ ముట్టడి డ్రామా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర డీజీపీ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సైన్యంలో చేరాలనుకొనే యువకులు అల్లర్లకు పాల్పడరు అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం గుండాలను పంపి అల్లర్లను ప్రొత్సహించారని, అగ్నిపథ్‌ మీద చర్చకు ట్విట్టర్ మంత్రి సిద్దమా అంటూ ఆయన సవాల్‌ విసిరారు. ట్విట్టర్ లో హింసాత్మాక ఘటనలు ప్రొత్సహించే మీ అకౌంట్ బ్లాక్ చేయాల్సి వస్తందటూ ఆయన హెచ్చరించారు. నేడు చోటు చేసుకున్న అల్లర్ల వెనుక కచ్చితంగా రాజకీయ పార్టీల హస్తం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version