అయ్యన్నపాత్రుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే ఉమాశంకర్

-

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మళ్లీ రాజకీయాలు హిట్ పుట్టిస్తున్నాయి. సీఎం వైయస్ జగన్ సభను అడ్డుకుంటామని టిడిపి నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న అయ్యన్నపాత్రుడు మగాడే అయితే.. మగతనమే ఉంటే సభ దగ్గరకు రావాలని.. అక్కడే తొక్కి పడేస్తామని హెచ్చరించారు.

ఒరేయ్ అయ్యన్నపాత్రుడు.. నీకు తెలిసిన భాషలోనే అర్థం అయ్యేటట్లు చెబుతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నర్సీపట్నంలో ఇదేం కర్మ రైతులకు అంటూ టిడిపి ర్యాలీ నిర్వహించింది. ఈ వేదికపై మాట్లాడిన అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు బకాయిలు చెల్లించకుండా బహిరంగ సభకు వస్తే సీఎంని అడ్డుకుంటామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్.

Read more RELATED
Recommended to you

Latest news