కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడు : కడియం శ్రీహరి

-

మునుగోడులో బీజేపీ ఆటలు సాగవని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి ఏం చేయని బీజేపీ ఇప్పుడు మునుగోడుకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేవలం రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని కడియం ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కోవర్టురెడ్డి బ్రదర్స్‌ అని విమర్శించారు.

మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు రాజగోపాల్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలని కడియం శ్రీహరి అన్నారు. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై కక్ష చూపెడుతున్న బీజేపీ రాష్ట్రానికి ఎనిమిదేళ్లలో చేసిందేం లేదని విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని కిషన్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటని కడియం అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రం కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీని ప్రశ్నిస్తే వారిపై ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్నారనికడియం ఆరోపించారు. బీజేపీ అజెండా అంతా కులాల మధ్య కుంపటి పెట్టడమేనని విమర్శించారు. బీజేపీ పేద, బడుగు, బలహీనవర్గాలకు శత్రువని చెప్పడంలో సందేహం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news