బాలయ్య బాబు తో కబుర్లు చెప్పేదేవరో..!!

-

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న  అన్ స్టాపబుల్ షో అందరి మన్ననలు పొందుతూ , అత్యధిక హిట్స్ తో దూసుకుపోతోంది.ప్రస్తుతం అన్ స్టాపబుల్ మొదటి సీజన్ పూర్తి అయి ,ఆహా లో సీజన్ 2 స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది.  సీజన్ 2 కి సంబంధించిన మొదటి ఎపిసోడ్లో నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ హాజరయ్యారు. అయితే బాలకృష్ణ తన షోలో అందరినీ సరదాగా వుంచేలా చేస్తున్నాడు.

ఆఖరికి చంద్రబాబు నాయుడు తో కూడా తాను వయస్సు లో వున్నప్పుడు చేసిన కొంటె పనుల గురించి చెప్పించాడు. అలాగే లోకేష్ తో కూడా సరదాగా మాట్లాడించాడు. ఇప్పడు వచ్చే ఎపిసోడ్స్ లో గెస్ట్స్ ఎవరు రాబోతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. మొదటి సీజన్లో మోహన్ బాబు, మహేశ్ బాబు, అల్లు అర్జున్, నాని, రవితేజ, రాజమౌళి, రానా వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. కాని సీనియర్ హీరోలు పాల్గొనలేదు. వారిలో, చిరంజీవి, వెంకటేష్ నాగార్జున వున్నారు.

అన్ స్టాపబుల్  రెండో సీజన్  మొదటి ఎపిసోడ్ చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ తో మొదలవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. కాని బాలకృష్ణ సూచనల మేరకు చంద్ర బాబు, లోకేష్ లను పిలిచారట. ఆ ఎపిసోడ్ కూడా మంచిగా రీచ్ అయ్యింది.ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన హీరోలు ఎప్పుడు వస్తారని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news