ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రమాణ స్వీకారం రేపే… ఏర్పాట్లు పూర్తి!

-

ఈ మధ్యనే ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయినా సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. ఈయనను టీడీపీ బలపరిచిన విషయం అందరికీ విదితమే. ఈ విజయం వైసీపీని ఎంతగానో బాధించింది అని చెప్పాలి. ఖచ్చితంగా గెలవాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది వైసీపీ.

ఇదిలా ఉంటే కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గా మార్చ్ 31 అంటే రేపు మధ్యాహ్నం వెలగపూడి లోని ఏపీ శాసనమండలి చైర్మన్ ఆఫీస్ లో ప్రమాణస్వీకార ఉత్సవం జరగనుంది. దీనికి సంబంధించి అన్నీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ ప్రమాణ స్వీకారానికి ముందు కంచర్ల శ్రీకాంత్ మధ్యాహ్నం 12 గంటలకు మంగళగిరి లో ఉన్న టీడీపీ కార్యాలయం నుండి ర్యాలీ గా వెళ్లనున్నారు. ఈ ర్యాలీ కి టీడీపీ కార్యకర్తలు మరియు నాయకులు రావాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version