ఈడీ కార్యాలయానికి బయల్దేరిన కవిత

-

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరారు. దిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఆమె ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. కవితకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు దేశ రాజధానికి చేరుకున్నారు. తుగ్లక్ రోడ్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకుని కవితకు మద్దతుగా నినాదాలు చేశారు.

మూడ్రోజులుగా కవిత కేసీఆర్ నివాసంలోనే ఉన్నారు. ఈడీ విచారణ దృష్ట్యా రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నిన్న దిల్లీకి వెళ్లారు. అర్ధరాత్రి వరకు న్యాయనిపుణులతో చర్చించారు. కాసేపట్లో కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అరుణ్ పిళ్లైను కూడా కవితతో కలిసి ఇవాళ విచారించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news