మమతా గెలిచింది… మోడీ రాజీనామా చేస్తారా? : కవిత

-

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది… హుజురాబాద్ ఎన్నిక టీఆరెస్ విజయం ఖాయమని… ప్రతి ఎన్నికకు సవాల్ చేయడం కరెక్ట్ కాదని చురకలు అంటించారు. నిన్న భవానీ పూర్‌ లో మమతా బెనర్జీ గెలిచింది- ప్రధాని మోడీ రాజీనామా చేస్తారా ? అని ప్రశ్నించారు.

kalvakuntla kavitha supports singareni employees protest on coal mines privatization issue

మమతా బెనర్జీ ఎన్నిక బీజేపీ ఛాలెంజ్ గా తీసుకుంది కదా ? అని ఫైర్‌ అయ్యారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని… రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళ్తారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. హుజురాబాద్‌ నియోజక వర్గం లో గెలిచేది.. టీఆర్‌ఎస్‌ పార్టీనేనని కుండు బద్దలు కొట్టారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

 

Read more RELATED
Recommended to you

Latest news