TRS జెండా మోసినోళ్లకే డబల్ బెడ్ రూమ్ – కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ జండా మోసినోళ్లకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తాం తప్పా.. వేరే వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నిర్వహించిన టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే సీఎం కేసీఆర్ ఇండ్లు కట్టుకోవడానికి మూడు లక్షలు ఇవ్వనున్నారని.. ఆ డబ్బు కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలకి అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర టిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇచ్చిన లిస్టులో పేర్లు ఉన్నవారికి మాత్రమే డబుల్ బెడ్ ఇళ్లను ఫైనల్ చేస్తామని అన్నారు. సోమవారం పెద్దపల్లి లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో.. టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, జన సమీకరణ కోసం ఈ టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news