Breaking : నేడు కూడా పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు..

-

తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావారణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఇలాగే కురుస్తాయని వెల్లడించింది. అయితే.. వానల ప్రభావంతో హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. భారీ వర్షాలు వస్తుండటంతో లింగపల్లి-హైదరాబాద్‌ మధ్య ఎంఎంటీఎస్‌ రాకపోకలను నిలిపివేసింది దక్షిణ మధ్య రైల్వే.

Hyderabad: Call to resume MMTS gets louder

ఇక ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య సర్వీసులను తాత్కాలికంగా దక్షిణ మధ్య రైల్వే నిలిపివేసింది. మొత్తంగా 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దుచేసింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రభుత్వం మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news