బిజెపి కార్యాలయంలో మాక్ పోలింగ్.. హాజరైన బిజెపి ఎమ్మెల్యేలు

-

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ..బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మాక్ పోలింగ్ లో ముగ్గురు ఎమ్మెల్యేలం హాజరయ్యామని తెలిపారు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ నిర్వహించుకున్నామని, మాక్ పోలింగ్ విజయవంతమైందని తెలిపారు. బ్యాలెట్ పత్రాలు ఓపెన్ చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామన్నారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. భారతదేశానికి గిరిజన అభ్యర్థి రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఇతరులెవరూ గిరిజనులకు ఈ అవకాశం ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలంతా ముర్ము కే ఓటేయాలని సూచించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఆదివాసి మహిళా ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం అన్నారు. ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. గొప్ప దార్శనికత ప్రదర్శించి మోదీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. రాజ్యాధికారం వస్తే వారి బతుకులు బాగు పడతాయని మోడీ ఆలోచన చేస్తుంటే.. ఇక్కడ మాత్రం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు లాక్కుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news