ఏప్రిల్ 10న ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణన‌కు ముహూర్తం ఫిక్స్!

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తుంది. వ‌చ్చె నెల 10వ తేదీ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర కేబినెట్ ను విస్త‌ర‌ణ చేయ‌నున్నార‌ని స‌మాచారం. దీనికి సీఎం వైఎస్ జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే విశాఖ శారదా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. కాగ ఇటీవ‌ల వైసీపీ పార్టీ అగ్ర‌నేత విశాఖ శారదా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి వ‌ద్ద‌కు వెళ్లార‌ని.. కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం గురించి మాట్లాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి.

అందులో భాగంగానే శారదా పీఠం అధిప‌తి ఏప్రిల్ 10వ తేదీన మంత్ర వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల‌లో దాదాపు అంద‌ర‌ని తొల‌గించే అవ‌కాశం ఉంద‌ని సమ‌చారం. కేవ‌లం ముగ్గురు మంత్రుల‌ను మాత్ర‌మే అలాగే ఉంచ‌నున్నార‌ని తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న మంత్రులకు జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌తో పాటు మ‌రి కొన్ని బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version