41 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్..!

-

కరోనా వైరస్ కేసులు ఇంకా అన్ని చోట్ల నమోదవుతూనే వున్నాయి. ఇంకా వేలల్లో కరోనా కేసులు వందల్లో మరణాలు వస్తూనే వున్నాయి. అయితే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే అవసరమైన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. కరోనా వైరస్ కి సంబంధించి తాజా వివరాలని చూస్తే..

గత 24 గంటల నుండి కరోనా వైరస్ కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూస్తే… గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 374 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 414482 మంది చనిపోయారు అని తాజాగా విడుదలైన నివేదిక ద్వారా తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికి 41 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక గత 24 గంటల్లో 52,67,309 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటికి మొత్తం 41,18,46,401 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా నుండి ఎంత మంది కోలుకున్నారు అనేది చూస్తే… దేశంలో అలానే ఇంకా 406130 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గత 24 గంటల్లో మరో 45254 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. దీనితో ఇప్పటి వరకూ 30353710 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు అని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news