ఎంత పని చేశావమ్మా.. నలుగురు పిల్లలతో సహా విషం తాగిన తల్లి

-

నవమాసాల కడుపున మోసిన తల్లి.. తన బిడ్డకు చీమ కుట్టిన భరించలేదు. కానీ.. ఆ తల్లి తన పిల్లలు ఏకంగా విషాన్నే పాయసంలా తాగించి.. ఆపై తాను తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని వైశాలీ జిల్లాలో కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ తల్లి.. తన నలుగురు పిల్లలతో సహా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు, తల్లి ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పాతేపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సుక్కీ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. సుక్కీ గ్రామానికి చెందిన రంజిత్​ సాహ్నీ భార్య తన నలుగురు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలు రింకు దేవీగా (35) చిన్నారులు 11 ఏళ్ల కరణ్​ కుమార్​, 8 ఏళ్ల శివానీ కుమారి, నాలుగేళ్ల సలోని కుమారిగా గుర్తించాం. అని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news