’కేసీఆర్ ను టచ్ చేస్తే మాడి మసై పోతావ్‘ బండి సంజయ్ కి మోత్కుపల్లి నర్సింహులు వార్నింగ్.

-

దళిత జాతి ఉద్ధరణకు పాటు పడుతున్న ఏకైన నాయకుడు కేసీఆరే అని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కేసీఆర్ ను టచ్ చేస్తే మాడి మసై పోతావ్.. ఓట్ల కోసమే బీజేపీ గారడీ విద్యలు అంటూ విమర్శించారు. బండి సంజయ్ నీకు సిగ్గు లేదా.. మాకులం వెంట పడ్డావ్ అంటూ తీవ్ర పదజాలంలో విరుచుకుపడ్డారు. దళితులకు దళిత బంధు పథకం ద్వారా కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చే ప్రభుత్వాన్ని విమర్శిస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ కి కావాలంటే ట్రాక్టర్ ఇస్తాం దున్నుకో .. అని ఎద్దేవా చేశారు మోత్కుపల్లి.

Motkupalli Narasimhulu

దేశంలో ఎక్కడైనా.. ఏప్రభుత్వమైనా.. సీఎం అయినా దళితులకు ఇటు వంటి పథకాన్ని అమలు చేస్తున్నారా..అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ నాయకుడైనా దళితులను గురించి పట్టించుకున్నాడా.. ఇప్పుడు కేసీఆర్ చిత్తశుద్ధితో దళితబంధు అమలు చేస్తుంటే బీజేపీ వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. దళితులకు అడ్డం వస్తే తొక్కుతాము అని హెచ్చిరించారు. హుజూరాబాద్లో, వాసాలమర్రిలో దళితుల ఖాతాల్లో డబ్బులు పడింది నిజం కాదా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news