తీన్మార్ మల్లన్న బిజెపిలో చేరికపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు !

-

తీన్మార్ మల్లన్న బిజెపిలో చేరడం పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తి కర కామెంట్స్ చేశారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల పై ప్రజలు ఎలా బుద్ధి చెప్తారనేది.. నవంబర్ 2 న తేలిపోతుందన్నారు. తీన్మార్ మల్లన్న బిజెపి పార్టీ లో చేరుతున్నట్టు నిన్న శ్రీశైలం బయలుదేరిన తర్వాత తెలిసిందని పేర్కొన్నారు. బీజేపీలో మల్లన్న చేరడం తో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశా భా వం వ్యక్తం చేశారు.

తీన్మార్ మల్లన్న కు స్వాగతం పలుకుతున్నా నని ఎంపి అరవింద్ చెప్పారు. కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఒక ఆశాజీవి…. కాంగ్రెస్ కు నాయకత్వం లేదని చురకలు అంటించారు. కాంగ్రెస్ జాతిని విచ్ఛిన్నం చేసే వ్యక్తులను కూడా పార్టీ లో చేర్చుకుంటుందని ఎంపి అరవింద్ ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి ఎన్ని లక్షల కోట్ల నిధులు వచ్చాయో చెపుతున్నామని.. లేఖలు కూడా విడుదల చేస్తున్నామని ఎంపి అరవింద్ పేర్కొన్నారు. కెసిఆర్, కేటీఆర్ అబద్ధాలు ఆడడంలో మేధావులు అని ఎద్దేవా చేశారు. కాగా జై బిజేపి అంటూ నిన్న స్వయంగా తీన్మార్ మల్లన్ననే తన సోషల్ మీడియా లో పేర్కొన్న సనగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version