పర్వత అధిరోహణ చేయనున్న గిరిజన విద్యార్థినికి ఎంపీ సంతోష్ ఆర్థిక సాయం

-

కిలిమంజారో పర్వత అధిరోహణ చేయనున్న గిరిజన విద్యార్థిని బానోతు వెన్నెలకి తన వంతు సహాయంగా 3 లక్షల రూపాయలు అందజేసి, వెన్నెలను ఆశీర్వదించారు రాజ్య సభ సభ్యులు జోగిన పల్లి సంతోష్ కుమార్. జనవరి 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారా పర్వత అధిరోహణ చేయనున్న సందర్భంగా ఈరోజు ప్రగతి భవన్ లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్ంది గిరిజన విద్యార్థిని బానోత్ వెన్నెల.

ఈ సందర్భంగా భానోతు వెన్నెల మాట్లాడుతూ.. “మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారం పేట గ్రామం అని గిరిజన కుటుంబం. నాకు చిన్నతనం నుండి పర్వత అధిరోహణ చేయడం ఇష్టం. అందులో భాగంగా ఈనెల 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో (5895) మీటర్ల పర్వతాన్ని అధిరోహించడం కోసం వెళ్ళటం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ (8840) మీటర్ల పర్వతాన్ని కూడా అధిరోహిస్తాను” అని తెలిపింది.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు వెన్నెల ను అభినందిస్తూ నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వెన్నెల పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా తన వంతు సహాయంగా మూడు లక్షల(3,00,000) రుపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ కుడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news