వేములవాడకు మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు : కేటీఆర్‌

-

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మంత్రి కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. సెస్ (సహకార విద్యుత్ సరఫరా సంఘం) ఎన్నికల్లో చూపించింది ట్రైలర్ మాత్రమేనని, బీజేపీకి ఈ ఏడాదిలోనే అసలైన సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. కేంద్రం నిధులపై తన సవాల్ కు కట్టుబడి ఉన్నానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రమే పోషిస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్. ఇది తప్పయితే రాజీనామా చేసి వెళ్లిపోతా… లేదంటే మీరు రాజీనామా చేస్తారా? అంటూ మరోసారి సవాల్ విసిరారు. బీజేపీని నడిపించేది మూర్ఖులు అని విమర్శించారు.

మేము ఉద్యోగాలు ఇస్తుంటే బండి సంజయ్ వద్దంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ కి అసలు తెలివి, మెదడు అనేవి ఉన్నాయా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ కు ఎంపీగా బండి సంజయ్ ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. వేములవాడకు మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మోదీ దేవుడంటూ బీజేపీ నేతలు డబ్బాలు కొడుతున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news