జగన్‌ తనయకు ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు..

-

సీఎం జగన్, వైఎస్ భారతిల పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ విద్యా సంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. పుత్రికోత్సాహంతో సీఎం జగన్ దంపతులు పొంగిపోతున్నారు. కాగా, హర్షిణి మాస్టర్స్ డిగ్రీ అందుకోవడం పట్ల వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. “ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి డిస్టింక్షన్ సాధించినందుకు హర్షిణికి శుభాభినందనలు. తమ కుమార్తె ఘనత పట్ల తల్లిదండ్రులుగా గర్విస్తున్న జగన్ సర్ కు, భారతమ్మకు అభినందనలు తెలియజేస్తున్నాను.

Image

ముఖ్యంగా, తమ పిల్లల్లో విద్యా ప్రాముఖ్యత, విలువలు, ఆత్మవిశ్వాసం, వినయవిధేయతలను పెంపొందించినందుకు భారతమ్మను అభినందిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌ తన కుమార్తె హర్షిణిరెడ్డికి.. పుత్రికోత్సాహంతో డియర్‌ హర్ష.. గర్వంగా ఉందంటూ.. ట్విట్‌ చేశారు. అయితే.. ఈ కాన్వకేషన్ లో తమ కుమార్తె పట్టా అందుకోవటం ప్రత్యక్షంగా చూసేందుకు సీఎం జగన్ – భారతి దంపతులు పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news