కేసీఆర్‌, జగన్‌కు ముద్రగడ బహిరంగ లేఖ..

-

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… కేసీఆర్ , జగన్ కు లేఖ రాశారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ఇటీవల వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు వెన్నెముక విరిగిపోయిందని… తడిచిన ధాన్యం ప్రభుత్వాలు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని లేఖ ద్వారా కోరారు. తడిచిన ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్ తయారు చేసేందుకు ఆస్కారం ఉంటుందని… జిల్లాకు ఒకటి చొప్పున ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్ డిస్టిలరీ ఏర్పాటు కావాలని పేర్కొన్నారు ముద్రగడ.

తద్వారా ధాన్యం తడిచినా రైతులకు మద్దతు ధర వస్తుందని… నేను మంత్రిగా పని చేసిన సమయంలో ఈ ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. ఇరువురు సి.ఎం.లు ధాన్యం నుంచి స్పిరిట్ తయారు చేసే డిస్టిలరీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే రైతులకు నష్టాలు రావని తెలిపారు. వరి వద్దనీ వాణిజ్య పంటలు వేయమని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. నీరు అధికంగా ఉండే భూముల్లో వరి తప్ప వాణిజ్య పంటలకు అస్కారం ఉండదని లేఖలో పేర్కొన్నారు. రైతులను ఇద్దరూ సీఎంలు ఆదుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news