డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముందుకు ఆర్యన్ ఖాన్ ..

-

ముంబై క్రూయిజ్ షిష్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో సహ పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. విచారణలో భాగంగా ఆర్యన్ ఖాన్ అరెస్ట్ చేశారు. దాదాపుగా 27 రోజుల పాటు జైలులో ఉన్నాడు. అక్టోబర్ 2న పట్టుబడ్డ ఆర్యన్ ఖాన్ కు అక్టోబర్ 29న ముంబై హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ తో పాటు ఆర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేసింది హైకోర్ట్. బెయిల్ ఇచ్చే సమయంలో ఆర్యన్ ఖాన్కు షరతులు విధించింది.

దీంట్లో భాగంగానే ప్రతీ శుక్రవారం విచారణలో భాగంగా ఎన్సీబీ ముందు హాజరు కావాలని షరతు విధించింది. తాజాగా ఆర్యన్ ఖాన్ నేడు ఎన్సీబీ అధికారుల ముందు హాజరుకానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ జరుగనుంది. ముంబై క్రూయిజ్ షిప్ కేసులో ఆర్యన్ తో పాటు మొత్తం 20 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news