ఐపిఎల్ 2023: పృథ్వి షా పై వేటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ !

-

ఈ రోజు గౌహతి వేదికగా ఢిల్లీ మరియు రాజస్థాన్ జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకుని అందరినీ షాక్ కు గురి చేశాడు. మామూలుగా ఈ పిచ్ స్వభావాన్ని బట్టి ఎక్కువ పరుగులు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిసింది. కానీ ఈ అవకాశాన్ని వార్నర్ టీమ్ చేజేతులా పాడు చేసుకుంది అని చెప్పాలి. అంతే కాకుండా గత రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ఢిల్లీ టీమ్ లోనూ రెండు మార్పులు చేసింది పెళ్లి కారణంగా ఆస్ట్రేలియా వెళ్లిన మార్ష్ స్థానంలో పావెల్ జట్టులోకి రాగా, మనీష్ పాండే పృథ్వి షా స్థానంలో జట్టులోకి వచ్చాడు.

గత రెండు మ్యాచ్ లుగా విఫలం అవుతూ వచ్చిన పృథ్వి షా కు ఈ మ్యాచ్ లో తుది జట్టులో నుండి తప్పించి… ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో జత చేసింది. మరి ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకునే ఆలోచనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉందా అన్నది తెలియాలంటే మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news