కరోనా ఎఫెక్ట్ : మైసూర్ ప్యాలెస్ మూసివేత..!

-

కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్‌ ను గురువారం అధికారులు మూసివేశారు. ప్యాలెస్‌ లో పనిచేసే ఉద్యోగి బంధువుకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అయితే ప్యాలెస్‌ ను మళ్లీ సోమవారం తెరిచే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అయితే కరోనా నేపథ్యంలో మార్చి 15 నుంచి 22 వరకూ వారం రోజుల పాటు ప్యాలెస్‌ ను మూసివేసినట్లు ప్యాలెస్ కమిటీ తెలిపింది.

కరోనా కట్టడి కోసం కర్ణాటక ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అయినా కూడా రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,228 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 1,373 కేసులు బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది. గత 24 గంటల్లో కర్ణాటకలో కరోనా వల్ల 17 మంది మరణించారు. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 486కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news