గరికపాటి పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు.. అంత అసూయ ఎందుకు ?

-

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పతియేట నిర్వహించే అలయి బలాయి కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి నిన్న హాజరైన సంగతి తెలిసిందే. చిరంజీవితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పలుకురు ప్రముఖులు ఆ కార్యక్రమానికి వచ్చారు. గరికపాటి నరసింహారావు ప్రసంగించే సమయంలో యువతులు చిరంజీవితో ఫోటోలు దిగుతున్నారు.

దీంతో ఆగ్రహానికి లోనైన గరికపాటి.. చిరంజీవి గారు మీరు ఫోటోషూట్ ఆపేస్తే నేను ప్రసంగాన్ని కొనసాగిస్తా అంటూ సీరియస్ అయ్యారు. లేకపోతే ఇకనుంచి వెళ్ళిపోతా అంటూ ఓ రేంజ్ లో చిరంజీవి పై ఫైర్ అయ్యారు. అయితే దీనిపై తాజాగా చిరంజీవి తమ్ముడు నాగబాబు స్పందించారు.

 

గరికపాటికి చిరంజీవి అంటే అసూయ అంటూ మండిపడ్డారు. కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు polish తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వేల్యూ ఎప్పుడు తగ్గదన్నారు. సరైన polish (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టమని చురకలు అంటించారు. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అంటూ ఫైర్ అయ్యారు నాగ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news