ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న వైసీపీని సాగనంపాలి – మెగా హీరో సంచలనం

-

ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న వైసీపీని సాగనంపాలని మెగా హీరో, జనసేన పీఏసీ మెంబర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీపీఎఫ్ మళ్లింపు సాంకేతిక లోపమైతే పంచాయితీ నిధులు దారి మళ్లించడాన్ని ఏమంటారు..? అని ప్రశ్నించారు. ప్రజల కష్టార్జితం, ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న వైసీపీని సాగనంపాలని కోరారు నాగబాబు.

గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జమ చేసిన 15వ ప్రణాళిక సంఘం నిధులను మళ్లించుకోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. ఉద్యోగుల కష్టార్జితం రూ.800 కోట్లు మళ్లించేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.

రాజకీయాలకతీతంగా పౌర సమాజం బాధిత ఉద్యోగుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు నాగబాబు. ఉద్యోగుల కష్టార్జితం దోచుకునేందుకు తెగించడం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి పరాకాష్ట అని చెప్పారు. టీటీడీ వసతి గృహల అద్దె నిమిత్తం వసూలు చేసే రిఫండబుల్ డిపాజిట్లు ఏం చేస్తున్నారని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news