ఈ రోజు నాగ్, నవంబర్ 19 న చిరు ఓటిటి లో హంగామా..!!

-

దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న భారీ అంచనాల మధ్య విడుదలైన నాగార్జున ఘోస్ట్ సినిమా  తో క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా ,చిరంజీవి గాడ్ ఫాదర్ తో మాస్ ను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓటిటి లోకి అడుగు పెడుతున్నాయి.

నాగార్జున ఘోస్ట్ ఈ రోజు(నవంబర్ 2) నుంచి నెట్‌ఫ్లిక్స్‌తో ది ఘోస్ట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా.. అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్ గాడ్ ఫాదర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ 19న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. దీంతో మెగా అభిమానులు ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news