కొండా సురేఖపై లీగల్ యాక్షన్‌కు నాగార్జున సిద్ధం

-

మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారని.. అంతేకాకుండా టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు నాగార్జున ఫ్యామిలీ, సమంత మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి మీద విమర్శలు గుప్పిస్తోంది.

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంత్రి సురేఖకు కాల్ చేసి మందలించడంతో గురువారం ఉదయం కొండా సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పారు. తను కావాలని సమంత మీద అనుచిత వ్యాఖ్యలు చేయలేదుని, కేటీఆర్‌ని మీద కోపంతో, ఆయన్ను విమర్శించే క్రమంలో చేసినట్లు పేర్కొన్నారు.కొండా సురేఖ మాట్లాడుతూ..‘కేటీఆర్‌ నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు.ఆ ఆవేదనతోనే ఇలాంటి కామెంట్స్ చేశారని’ తెలిపారు. ఇదిలాఉండగా, మంత్రి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన నాగార్జున.. ఆమెకు లీగల్ నోటీసులు పంపించి,న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version