ఆ నలుగురికి నందమూరి రామకృష్ణ వార్నింగ్.. హద్దులు దాటారని హెచ్చరిక

-

తన భార్య భువనేశ్వరిపై, తన కుటుంబ సభ్యులపై వైసీపీ ప్రజాప్రతినిధుల అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతం కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ ఘటనపై నందమూరి ఫ్యామిలీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. నందమూరి బాలక్రిష్ణ తన సోదరిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. రెండు, మూడేళ్ల నుంచి చూస్తున్న ఘటనలు చూస్తుంటే… చాలా బాధగా ఉందన్నారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిణామం ఏ కుటుంబానికి జరగకూడదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, కోడాలి నాని, అంబటి రాంబాబులతో పాటు వల్లభనేని వంశీలకు స్ట్రయిట్ గా వార్నింగ్ ఇచ్చారు.హద్దులు మీరారని.. వారు భవిష్యత్ గురించి ఆలోచించుకోని మాట్లాడాలన్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు ఏమనుకుంటున్నారో చూసుకోండి అంటూ ఫైరయ్యారు నందమూరి రామకృష్ణ. తామేం గాజులు తొడుక్కుని కూర్చోలేదని..  ఎన్టీఆర్, టీడీపీ క్రమశిక్షణ మాత్రమే నేర్పిందని పేర్కొన్నారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని నందమూరి రామకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.  ఇకపై వైసీపీ హద్దు మీరితే… తామూ హద్దు మీరుతామని స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news