హాజరు మినహాయింపు దక్కలేదని కోర్టును కూడా రద్దు చేస్తారా..? నారా లోకేష్‌

-

శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టారు. మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ పై నారా లోకేశ్ సెటైర్లు వేశారు. శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో జగన్ పై లోకేశ్ ట్వీట్ చేశారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు దక్కలేదని పేర్కొన్నారు. అయితే “వ్యక్తిగత హాజరు మినహాయింపు దక్కలేదని కోర్టులను రద్దు చేస్తారా? లేకపోతే, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని ఏకంగా శుక్రవారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా?“ అంటూ సెటైర్ వేశారు.

ఈ సందర్భంగా మండలి రద్దు నిర్ణయాన్ని లోకేశ్ తప్పుబట్టారు. కొన్ని బిల్లులు ప్రజాభిప్రాయం కోసం సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లడం సాధారణమైన విషయమని, బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళితే జగన్ ఎందుకు వణికిపోతున్నాడని ప్రశ్నించారు. మండలిని రద్దు చేసి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నది ప్రజలు కోరుకున్నది కాదని, తన స్వార్థ నిర్ణయం అని జగన్ స్వయంగా ఒప్పుకున్నాడని లోకేశ్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news