శవాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయిన ఘనత జగన్ కే దక్కుతుంది: నారా లోకేష్

-

ప్రకాశం జిల్లా ఒంగోలు లో నిర్వహిస్తున్న టిడిపి మహానాడులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. పసుపు జెండాని మోస్తున్న కార్యకర్తలందరికీ పాదాభివందనం అంటూ ప్రసంగం ప్రారంభించారు. మహానాడుకు లక్షలాది కార్యకర్తలు తరలి వచ్చారు అని వెల్లడించారు. మనది పసుపు జెండా.. మన శరీరం కోస్తే పసుపు రంగు వస్తుంది అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేశారు.

” అయ్యా జగన్.. నువ్వు బస్సులను పగలగొడతా వు, మా కార్ల టైర్లలో గాలి తీయగలుగుతావు, కానీ టిడిపి కార్యకర్తలను మాత్రం ఆపలేరని ఈ సభాముఖంగా చెబుతున్నాను అన్నారు. శవాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి అయిన ఘనత జగన్ కే దక్కుతుందని ఘాటు విమర్శలు చేశారు లోకేష్. అంతేకాదు వైయస్సార్సీపి అంటే కొత్త అర్థాన్ని కూడా చెప్పారు. వైయస్సార్సీపి అంటే యువజన శృంగార, రౌడీ కాంగ్రెస్ పార్టీ అని లోకేష్ కొత్త భాష్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news