MLC ఎలక్షన్ ట్రైలర్‌ మాత్రమే.. సినిమా 2024లో చూస్తారు : నారా లోకేశ్‌

-

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా 2024లో చూస్తారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. దానికి నిదర్శనమే ఎమ్మెల్సీ ఎన్నికలని వ్యాఖ్యానించారు.

‘నాడు సీఎం జగన్‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి తన వెంట్రుక కూడా పీకలేరన్నారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఏకంగా గుండు కొట్టారు’ అని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. 47వ రోజు యువగళం పాదయాత్ర శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం చిన్నపల్లెవాండ్లపల్లిలో కొనసాగింది. రాత్నాలపల్లి వద్ద 600 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా చిన్నయల్లంపల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి జోగన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్న జగన్‌కు మూడు ప్రాంతాల ప్రజలూ మూడు మొట్టికాయలు వేశారని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news