గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మరో మూడు నెలల సమయాన్ని పొడిగించాలి : లోకేశ్

-

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల కోసం ఇచ్చిన 85 రోజుల సమయం చాల‌ద‌ని, మ‌రో 3 నెల‌ల అద‌న‌పు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరుతూ ఏపీపీఎస్సీ చైర్మ‌న్ గౌతం స‌వాంగ్‌కి లేఖ రాశారు. గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష క్వాలిఫై అయిన అభ్య‌ర్థులు ప్రిపరేషన్ కోసం కేవ‌లం 85 రోజులే ఇచ్చార‌ని, ఏడు పేపర్లు ప్రిపేర్ కావ‌డానికి ఈ 85మరోజులు సరిపోవని ఆయన లేఖలో తెలిపారు.

Yuva Galam': TDP seeks permit for Nara Lokesh's padayatra- The New Indian  Express

మెయిన్స్ పరీక్షకు అన్ని అంశాలలో అవ‌స‌ర‌మైన‌ లోతైన జ్ఞానం, లోతైన విశ్లేషణ చేసేందుకు ఈ మూడు నెల‌ల స‌మ‌యం అస్సలు స‌రిపోద‌ని నారా లోకేష్ వ్యక్తపరిచారు. మెయిన్స్ పరీక్షకు మరో మూడు నెలల అద‌న‌పు సమయం పొడిగించాలని గౌతం సవాంగ్ ను కోరారు లోకేష్. కొత్త‌వారితో పాటు, ఉద్యోగాలు చేసుకుంటూ గ్రూప్-1 రాసేవారికి ఈ అద‌న‌పు స‌మ‌యం ప్రిపేర్ కావ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని లోకేశ్ ఆ లేఖ ద్వారా తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news