నా తల్లిని అన్న.. ఎవ్వ‌రినీ వదలను : నారా లోకేష్ వార్నింగ్

-

నారా భువ‌నేశ్వ‌రి పై గ‌తంలో వైసీపీ పార్టీ నేత‌లు అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా టీడీపీ జాతీయ ప్ర‌తినిధి నారా లోకేష్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. త‌న త‌ల్లిని అన్న వారిని ఎవ‌రినీ వ‌ద‌ల‌న‌ని వైసీపీ నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్‌. నా తల్లిని విమర్శించడం బాధించిందని…. నా తల్లిని కించపరిచిన వారిని మా నాన్న వదిలిపెట్టినా నేను వదలనని హెచ్చ‌రించారు.

ys jagan on nara lokesh

మీ త‌ల్లి గురించి ఇలాగే మాట్లాడ‌తారా… ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల‌ని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. మీరు మ‌నుషులా లేక ప‌శువులా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నారా లోకేష్‌. మా కుటుంబాన్ని బయటకు లాగాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని.. అప్పుడు వైసీపీ నేత‌ల ప‌ని చెబుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news