కేసీఆర్ కు రైతుల ఉసురు తగులుతుంది : వైఎస్ షర్మిల

-

కేసీఆర్ రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా దిగజారుస్తున్నాడని.. కేసీఆర్ కు రైతుల ఉసురు తగులుతుందని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి అన్నాక ముందు చూపు ఉండాలని… కెసిఆర్ రైతు ద్రోహి, ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని ప్ర‌శ్నించారు. పరిపాలనే చేత కాదు… ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని ప్ర‌శ్నించారు. కేసీఆర్ రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతులు బతికేవారని… డెబ్బై రోజుల్లోనే రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Sharmila
Sharmila

ఇవి ఆత్మహత్యలు కావు, కెసిఆర్ హత్యలని నిప్పులు చెరిగారు. పరిపాలన చేతకాక ధర్నాలు చేస్తూ చావు డప్పులు కొడుతూ ఢిల్లీ వెళ్లి అప్పాయింట్మెంట్ కూడా పొందలేకపోతున్నారని మండిప‌డ్డారు. మీ కుటుంబం తప్ప ఏ కుటుంబమన్నా బాగుపడిందా అని ప్ర‌శ్నించారు. హర్యానాలో చనిపోయిన రైతులకు ఆర్థిక సహయం చేస్తాడంట, ఇక్కడ చనిపోయిన రైతులకు ఒక్క పైసా అయినా ఇచ్చాడా అని నిల‌దీశారు. యాసంగిలో కాదు ఏ కాలంలోనైనా వరి పండించుకునే హక్కు రైతులకు ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news