లోకేష్‌ జూమ్‌ మీటింగ్‌ లో దూరిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

-

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలపై పెద్ద వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పదో తరగతి ఫలితాలపై.. ప్రతి పక్ష పార్టీలపై టీడీపీ అలాగే.. జనసేన పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. పదో తరగతి విద్యార్థులతో టీడీపీ పార్టీ కీలక నేత నారా లోకేశ్ ముఖా ముఖి నిర్వహించారు. అయితే.. నారా లోకేశ్ జూమ్ కాన్ఫరెన్సులోకి ఒక్క సారిగా టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరియు మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యక్షం అయ్యారు.

దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు జూమ్ సమావేశాలకు వచ్చారని నారా లోకేషుకి చెప్పారు తెలుగుదేశం నేతలు. వైసీపీ నేతలు ఉన్నా పర్లేదు, వాళ్ళ ప్రభుత్వం ఎలా ఏడ్చిందో తెలుస్తుందని నారా లోకేష్ వెల్లడించారు. విద్యార్థులను ఫెయిల్ చేయటం చేతగానితనం, దొంగ ఐడీలతో ఇలా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తారా అంటూ లోకేశ్ విమర్శలు చేశారు. దీంతో వెంటనే జూమ్ నుంచి వంశీ, కొడాలి నాని తప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news