కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సాగు చట్టాలపై ఆయన స్పందించారు. మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకువస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వల్ప మార్పులతో సాగు చట్టాలను మళ్లీ తీసుకువస్తామని వెల్లడించారు. నిన్న మహారాష్ట్ర నాగ్ పూర్ లో జరిగిన ఓ వ్యవసాయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారని.. 70 ఏళ్లలో రైతుల డెవలప్మెంట్ కోసం చేయని మోదీ చేసి చూపించారన్నారు.
అయితే ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంది. రైతులు చేస్తున్న ఉద్యమానికి దిగివచ్చింది.