పాస్‌ కాలేదని నీట్‌ విద్యార్థిని దారుణం

-

బీహార్ లోని కెవిపి కాలనీలో నికిత అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే… నికిత అనే విద్యార్థి ఇంటర్ పూర్తి చేసుకొని రెండు సంవత్సరాల నుంచి నీట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ తనకు సీటు రాలేదు. ఇంట్లోవాళ్ళు చదువు వద్దు పెళ్లి చేసుకో అని బెదిరించడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆ*త్యకు పాల్పడింది.

తమ కూతురు అలా చేసుకోవడంతో తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కూతురిని అలా చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ కూతురు చావుకు తామే కారణమంటూ బాధపడుతున్నారు. చదువు వద్దు పెళ్లి చేస్తాం అని చెప్పాము అంతమాత్రాన ఇలా చేస్తుంది అని అను కోలేదు అంటూ బాధపడుతున్నారు. నికిత డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రి కి తరలించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news