అల్లర్లతో మణిపుర్‌లో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు

-

మణిపూర్​లో రిజర్వేషన్ల అంశం తీవ్ర హింసకు దారితీసిన విషయం తెలిసిందే. మెయిటీ, కుకీ తెగల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా గత మూడు వారాలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో సుమారు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అల్లర్ల కారణంగా ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ అల్లర్ల వల్ల తాజాగా ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

అల్లర్ల దృష్ట్యా ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా ట్రక్కులను రాష్ట్రానికి నడిపేందుకు డ్రైవర్లు, యజమానులు ముందుకు రావడం లేదు. ఫలితంగా పలు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బియ్యం, బంగాళదుంప, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో రూ.900గా ఉన్న 50 కిలోల బియ్యం .. ఇప్పుడు రెట్టింపై రూ.1,800లకు చేరింది. రాజధాని ఇంఫాల్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.170 అయ్యింది. గ్యాస్‌ సిలిండర్‌ రూ. 1,800కు అమ్ముతున్నారు. కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. సాధారణంగా రూ.180గా ఉన్న 30 గుడ్ల ఒక క్రేట్‌ ధర .. అల్లర్ల అనంతరం రూ.300కి పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news