వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బిజెపి కనిపించదు – రాహుల్ గాంధీ

-

వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బిజెపి కనిపించదని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ న్యూయార్క్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ – యూఎస్ఏ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాలలోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బిజెపిని తుడిచిపెట్టయ్యగలమని కర్ణాటకలో నిరూపించామని అన్నారు. వారిని కేవలం ఓడించలేదు.. తుడిచిపెట్టేశామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక రాబోయే ఎన్నికల తర్వాత తెలంగాణలో బిజెపి ఉందో లేదో గుర్తించడం కష్టమవుతుందన్నారు. బిజెపి చేస్తున్న విద్వేష రాజకీయాలతో ముందుకు వెళ్లలేమని దేశ ప్రజల గుర్తించడమే అందుకు కారణం అన్నారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news