వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకి తగిన గుణపాఠం చెబుతాం – నారా లోకేష్

-

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పై దాడి దాడి యత్నం జరిగింది. ఆయన నేడు నెల్లూరు బివి నగర్ సమీపంలోని ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఎనిమిది మంది దుండగులు ఆయనపై కర్రలు, మారణాయుధాలతో దాడికి ప్రయత్నించారు. దీంతో టిడిపి నేతలు సికిందర్ రెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు, తదితరులు వారిని అడ్డుకున్నారు.

స్థానికులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుండి పారిపోయారు. ఈ ఘటనపై తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆనం వెంకటరమణారెడ్డి పై దాడి వైసిపి మూకల పనేనని ఆరోపించారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఉలికిపాటు..? అని నిలదీశారు నారా లోకేష్. తెలుగుదేశం వాయిస్ బలంగా వినిపిస్తున్న ఆనం వెంకటరమణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిన వైసిపి ఫ్యాక్షన్ ముఠాలకి తగిన గుణపాఠం చెబుతామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news