రిజర్వేషన్ల రద్దు కాంగ్రెస్ కుట్ర.. మాయావతి సంచలన వ్యాఖ్యలు

-

రిజర్వేషన్లపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయవతి స్పందించారు. రిజర్వేషన్లను అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అణగారిన వర్గాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఈ మేరకు ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. అమెరికాలో ఇటీవల రాహుల్ గాంధీ  చేసిన కామెంట్స్ ఓ డ్రామా అని ఆయన వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయలేదని.. కుల గణన సైతం చేపట్టలేదని ఆరోపించారు. కానీ ప్రస్తుతం ఈ రెండు అంశాల ముసుగులో అధికారంలోకి రావాలని కలలు కంటోందని విమర్శించారు. భవిష్యత్ లో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కులగణన నిర్వహించలేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని రక్షించే నెపంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కచ్చితంగా అంతం చేస్తుందని వెల్లడించారు మాయావతి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version