ఇండియాలో భారీగా పెరుగుతోన్న కరోనా..కొత్తగా 11,109 పాజిటివ్‌ కేసులు

-

భారత్‌లో కరోనా కేసులు.. భారీగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు.. ఇప్పుడు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో 11,109 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక భారత దేశ వ్యాప్తంగా 49,622 కరోనా యాక్టివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

ఇక అటు తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 45 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేసీఆర్‌ సర్కార్‌ అలర్ట్‌ అయింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news