ఇండియాలో ఫోర్త్‌ వేవ్‌ విజృంభణ..కొత్తగా 12,781 కరోనా కేసులు, 18 మరణాలు

-

మన దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువగానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,781 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,16,088 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 76,700 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.22 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 18 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,873 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8537 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,26,70, 900 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96,18,66,707 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 280136 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news