ఢిల్లీలో రోజు రోజుకు తగ్గుతున్న నీటి సరఫరా..!

-

దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం రోజు రోజుకు మరింత తీవ్రతరం అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవికాలంలో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి వనరులు తగ్గిపోయాయి. బోర్లలో నీరు మొత్తం కూడా అడుగంటి పోయింది. దీంతో ప్రజలు తమ అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పక్క రాష్ట్రం హర్యానా ఢిల్లీకి తక్కువ నీటిని విడుదల చేస్తుందని ఆప్ మంత్రి అతిషి గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె యమునా నదికి తక్కువ నీరు చేరుతున్నందున దేశ రాజధానిలో నీటి సంక్షోభం మరింత తీవ్రతరమైందని పేర్కొన్నారు.

సాధారణ పరిస్థితుల్లో, ఢిల్లీలో రోజు 1005 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుంది, కానీ గత వారం నుండి ఇది నిరంతరం తగ్గుతోంది, జూన్ 6న నీటి సరఫరా రోజుకు 1,002 మిలియన్ గ్యాలన్లు (ఎంజీడీ) ఉండగా, మరుసటి రోజు 993 ఎంజీడీలకు, జూన్ 8 నాటికి 990, జూన్ 9న 978, మరుసటి రోజు జూన్ 10న 958 ఎంజీడీలు, జూన్ 11, జూన్ 12, జూన్ 13 తేదీలో వరుసగా 919, 951, 939 ఎంజీడీలుగా నమోదైందని మంత్రి తెలిపారు. వర్షాలు పూర్తి స్థాయిలో కురవకపోవడం, ఎండల తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో ఢిల్లీలో నీటి కష్టాలు రాను రాను మరింత ఎక్కువ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version