నేషనల్ పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకుడు కన్నుమూత

-

జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ(JKNPP) వ్యవస్థాపకుడు భీంసింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భీంసింగ్ జమ్మూకాశ్మీర్లోని జిఎంసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మానవహక్కుల నేతగా, రచయితగా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా సుపరిచితుడైన భీమ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి 1982లో జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ ని స్థాపించారు. జమ్మూ కాశ్మీర్ కు 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది. పాలస్తీనా నేత అరాఫత్, క్యూబా విప్లవ నేత ఫెడెల్ కాస్ట్రో, సద్దాం హుస్సేన్, లిబియా నియంత గడాఫీ తో భీమ్ సింగ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భీమ్ సింగ్ భార్య, కుమారుడు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news