మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు

-

గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం నిన్నటి ధర కంటే స్వల్పంగా పెరిగాయి. పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కాస్త చేదు వార్త అనే చెప్పాలి. నిజానికి గత ఐదు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం ఈరోజు కాస్త తగ్గింది. హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹50,760కి పెరిగింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹49,760కి పెరిగింది. అయితే ఢిల్లీ మార్కెట్‌ లో కూడా ఈ రేట్ స్వల్పంగానే నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹53,620కి చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. అయితే నిన్నటి మీద కేజీకి వంద రూపాయలు తగ్గడంతో కేజీ వెండి ధర ₹62,700 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news